తెలుగు సినిమాలకు ఆల్మోస్ట్ దూరమైపోయిన అందాల ముద్దుగుమ్మ 

26 August 2025

Rajeev 

అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అక్టోబర్ 1, 1992న కేరళలోని చెరుపుజలో జన్మించింది.

మడోన్నా సెబాస్టియన్ మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది.

ఈ షో ద్వారా ఫేమస్ అయ్యి తొలిసారి సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అల్ఫోన్స్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోనా, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "ప్రేమమ్" చిత్రం 2015లో విడుదలైంది.

ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు భాషల్లోనూ మడోన్నా నటించింది.

2016లో నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన విజయ్ సేతుపతి చిత్రం వాలంతుమ్ పార్థియంతో తమిళ తెరపైకి అడుగుపెట్టింది.

ప్రేమమ్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది.

ప్రస్తుతం మడోనా తెలుగు సినిమాల కంటే తమిళ్, మలయాళ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది