‘గుంటూరు కారం’లో పూజాకు బదులుగా ఆ హీరోయిన్..

మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో  ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తుంది.

గతంలో ఈ చిత్రంలో  పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా నటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

కాగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి పూజా తప్పించినట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె ఈమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకోనున్నారని తెలుస్తోంది.

అయితే సెకండ్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను ప్రధాన కథానాయకిగా.. మీనాక్షిని రెండో హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.