గులాబీలతో నిండిపోయిన తాప్సీ.. ఎంత చూసిన తనివి తీరని అందం.

Anil Kumar

17 August 2024

ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హీరోయిన్ తాప్సీ పన్ను.

మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను.. ఎంతో ఆసక్తి తో 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది.

అక్కడ నుండి బాలీవుడ్ చెక్కేసి హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన సబాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ చిత్రంతో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకున్న తాప్సీ.

ఇటీవలే తన ప్రియుడితో బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తాప్సీ.. తాజాగా పింక్ డ్రెస్ లో రోజ్ ఫ్లవర్ పట్టుకొని దిగిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.