ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని నిజం చేస్తోంది సాయి పల్లవి. మల్లువుడ్లో ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. డెబ్యూ మూవీతోనే బ్లక్ బస్టర్ అందుకుంది.
వరుణ్ తేజ్కి జోడిగా ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ కుట్టి. భానుమతి పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచింది.
ఫిదా హిట్ కావడంతో టాలీవుడ్లో సాయి పల్లవికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళం, మలయాళంలో హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో అగ్ర తారామణుల జాబితాలో చేరిపోయింది.
‘లవ్ స్టోరీ’, ‘విరాటపర్వం’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి.. ఈ చిత్రాల తర్వాత ఇంకా కొత్త సినిమా ఒప్పుకోలేదు.
ఇప్పుడు సాయి పల్లవి కెరీర్కి సంబంధించి ఓ కీలక న్యూస్ అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే దీనిపై ఆమె నుంచి ఎలాంటి అధికారక ప్రకటన మాత్రం రాలేదు.
బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ సాయి పల్లవిని హీరోయిన్గా హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అమీర్ ఖాన్ తన కొడుకు జునైద్ని హీరోగా బాలీవుడ్కి పరిచయం చేస్తున్నారు. జునైద్ మొదటి చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటించనున్నారట. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదే హాట్ న్యూస్.
సాయి పల్లవి కథకు చాలా ప్రయార్టీ ఇస్తుంది. ఆమెకి ఈ కథ నచ్చినందునే ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి ఉంటారు. పైగా హిందీలో తన డెబ్యూ మూవీ కావడంతో.. అన్ని అంశాలను లోతుగా ఆలోచించి సైన్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది.