అలాంటివి చూస్తే మానసిక ఇబ్బంది.. అందుకే పట్టించుకోను: నేహ శెట్టి.

Anil Kumar

05 May 2024

డీజే టిల్లు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందులోని రాధికా అలియాస్ నేహా శెట్టి కూడా అంత పాపులర్ అయ్యింది.

ఈ సినిమాతో ఈ అమ్మడి కెరియర్ మారిపోయింది.. వరసబెట్టి అవకాశాలు అందుకుంటూ సైలెంట్ గా చేసుకుంటూ పోతుంది.

ఇక ఈ అమ్మడు తాజాగా గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాలో మాస్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనపై వచ్చే మీమ్స్ , అండ్ న్యూస్ పై తనదైన స్టైల్ లో స్పందించింది ఈ అమ్మడు.

తన గురించి వచ్చే మీమ్స్ , ఆర్టికల్స్ ని చదవనని.. అంతగా పట్టించుకోను అని అంటున్నారు హీరోయిన్ నేహా శెట్టి.

ఎవరైనా తనకు వాటిని ఫార్వర్డ్ చేస్తేనే చూస్తారట. చెడుగా రాసిన వార్తలు చదివితే మానసికంగా ఇబ్బంది తప్పదు.

అందుకే, అలాంటి వార్తలకు దూరంగా ఉంటానని అన్నారు నేహాశెట్టి. గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మే 31న విడుదల కానుంది. 

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియాలో న్యూ ఫొటోస్ తో , హాట్ ఫోజులతో కురాళ్ళ ఫ్యూజులు పోగెట్టేస్తుంది ఈ వయ్యారి.