ఎంత ఎదిగిపోయావమ్మా.! కృతి సనన్ కామెంట్స్ వైరల్..

Anil Kumar

25 May 2024

టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్.

ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి.. వరస అవకాశాలతో.. చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

సోషల్‌ మీడియా సైతం కృతి సనన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఈమె ఫాలోయింగ్ నెట్టింట సపరేట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకుంది అంటుంది. దీనిపై కృతి స్పందించింది.

నేను చేయగలిగాను అంటే, మీరూ చేయగలుగుతారు.. ఎవరికైనా ఇది వేదికగా నిలుస్తుంది అంటూ మట్లాడారు హీరోయిన్ కృతి.

ఈ పదేళ్ల సినిమా ప్రయాణంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. కొందరు గురువును అయ్యారని చెప్పారు కృతి.

వ్యక్తిగా, నటిగా ఎంతో ఎదిగినట్టు తెలిపారు. ఆనందాన్ని పంచే ఎన్నో అనుభూతులను మూటగట్టుకున్నానని అన్నారు. 

తాజాగా ఈ అమ్మడు కృతి ఇంస్టా లో షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.