ఆసుపత్రిలో చేరిన జాన్వీ కపూర్.. రూమర్స్ పై బోనీ కపూర్ క్లారిటీ.!

Anil Kumar

20 July 2024

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ వరస సినిమాలతో బిజీగా ఉన్న బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. అస్వస్థతకు గురయ్యారు.

తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్‌లో తిన్న పుడ్ కారణంగా.. ఆమె తీవ్ర కడుపు నొప్పితో రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు.

మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ మీడియాతో చెప్పారు.

ఎన్నో రూమర్స్ చెక్ పెడుతూ.. పుడ్ పాయిజన్ కారణంగానే తన కూతురు ఆస్పత్రిలో చేరినట్టు క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ హాస్పిటల్ లో చేరారన్న న్యూస్‌ తెలియడంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

"గెట్ వెల్ సూన్ జాను" అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటె జాన్వీ కపూర్ తాజాగా టాలీవుడ్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ తోనే కాకుండా మరో సినిమాకు సైన్ చేసారు.

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చెయ్యబోతున్న పాన్ ఇండియా సినిమాలో భాగమైపోయిందట బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ.