అందం అభినయం ఉన్నా.. స్టార్ హీరోయిన్‌గా కష్టమేనా..అను ఇమ్మాన్యుయేల్.

Anil Kumar

02 September 2024

28 మార్చి 1997న యునైటెడ్ స్టేట్స్‌లోని చికాగోలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అను ఇమ్మాన్యుయేల్.

మలయాళ నిర్మాత థంకచన్ ఇమ్మాన్యుయేల్ కుమార్తె. 2015లో లేక్‌వ్యూ సెంటెనియల్ హై స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసింది.

చదువు పూర్తైన కొన్నాళ్ళు US ఉంది. తరువాత నటనలో వృత్తిని కొనసాగించడానికి భారతదేశానికి వచ్చింది ఈ బ్యూటీ.

నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది అను ఇమ్మాన్యుయేల్‌

తెలుగులో అజ్ఞాతవాసి, నాపేరు సూర్య.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ , రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసింది.

అందం అభినయం ఉన్నాకూడా ఈ భామ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ఇక ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తుంది.

రీసెంట్ గా అల్లు శిరీష్ సరసన ఊర్వశివో రాక్షసివో చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. నెక్స్ట్ రావణాసురలో కనిపించింది.

ప్రస్తుతం తమిళ్ లో కార్తీ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా పైనే అను ఆశలు పెట్టుకుంది.