09 September 2023

నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారు - హీరో విశాల్‌

Pic credit - Instagram

కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్లోనూ స్టార్ ఇమేజ్‌ సంపాదించుకున్న విశాల్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొందరు ప్రొడ్యూసర్స్ తనను బ్లాక్ మెయిల్ చేశారని.. డబ్బులు గుంజారని ఎమోషనల్ అయ్యారు. 

తన సినిమా రిలీజ్‌కు ముందురోజే.. ఫైనాన్షియర్లకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే .. సినిమా రిలీజ్‌ ఆపేస్తామని బెదిరించే వారన్నారు. 

దీంతో చేసేందేంలేక తన డబ్బులు ఇచ్చేవాడినని.. తన సినిమా రిలీజ్ అయితే చాలనుకునే వాణ్ని అని చెప్పారు.

సినిమా రిలీజ్ అయి హిట్ అయినా కూడా.. సదరు నిర్మాతలు తన రెమ్యూనరేషన్‌ను కూడా పూర్తిగా ఇచ్చేవారు కాదన్నారు విశాల్. 

ఇలా కొందమంది నిర్మాతల చేసే బ్లాక్ మెయిల్‌ను తట్టుకోలేకే.. తాను ప్రొడ్యూసర్‌గా మారా అన్నారు.

ఆ కారణంతోనే తన సినిమాలను తన ప్రొడక్షన్ కంపెనీలోనే నిర్మిస్తున్నట్టు.. తన లేటెస్ట్ ఫిల్మ్ మార్క్‌ ఆంటోనీ ప్రమోషన్స్‌లో చెప్పారు విశాల్.