సెట్స్‌లోకి అడుగుపెట్టిన మహేష్..

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల నటిస్తుంది.

ఇద్దరు హీరోయిన్స్ కి స్థానం ఉన్న ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్‌ ఎంపిక కావాల్సి ఉంది.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా శనివారం ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ షూటింగ్ మొదలైంది.

ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టారు హీరో మహేశ్‌బాబు.

హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఓ భారీ ఇంటి సెట్‌లో మహేశ్‌బాబుపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.