ఇండియాలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఆ హీరో

02 August 2023

Pic credit - Instagram

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్ దాఖలయ్యాయని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.

దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించింది ఎవరని మీరు ఆశ్చర్యపోవచ్చు.

2021-22 సంవత్సరానికి గాను అక్షయ్ కుమార్ భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించిన వారి జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారు.

2022లో ఆయన నుంచి రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్ను జమ అయింది.

ఆ ఏడాది తన ఆదాయం రూ.486 కోట్లుగా ప్రకటించారు. 

అక్షయ్ కుమార్ బాలీవుడ్‌‌లో అతిపెద్ద స్టార్స్‌‌లో ఒకరు. పారితోషకం కూడా అదే రేంజ్‌‌‌లో తీసుకుంటారు.

ఏడాదికి 4-5 సినిమాలు చేస్తున్నారు.

ఇది కాకుండా తనకు సొంత ప్రొడక్షన్ హౌస్ , అలాగే స్పోర్ట్స్ టీమ్‌‌ కూడా ఉంది.