తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా.. 

26 September 2023

పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటే బాగుంటుంది కానీ అలా ఉండటానికి అది సినిమా కాదు కదా..!

ఎంత పెద్ద హీరోయిన్‌ కెరీర్‌కైనా ఏదో ఓ టైమ్‌లో ఎక్స్‌పైరీ డేట్ అయితే తప్పదు. తాజాగా పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది.

టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు ఈ భామ.

టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తోనే జోడీ కట్టారు పూజా.

వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి తనకు పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు కానీ ఇప్పటి వరకైతే అక్కడ్నుంచి కూడా ఆఫర్స్ రాలేదు.

గుంటూరు కారం ఛాన్స్ మిస్సయ్యాక.. పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న కోయి షక్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు పూజా.

దాంతో పాటు రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాలోనూ ఈమె పేరు పరిశీలిస్తున్నారు. గతంలోనే సర్కస్‌లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది.

అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ.. రాకపోతే ఇంకా హ్యాపీ అన్నట్లున్నారు ఈ బ్యూటీ. ఈ లెక్కన టాలీవుడ్‌కు పూజా బైబై చెప్పినట్లే..!