యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను - మాన్’. తెలుగుతో పాటు 11 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జాంబీరెడ్డి’ తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయక.
అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రదేశం నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందుతోంది.
గతంలో రిలీజ్ చేసిన టీజర్తో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అందులోని గ్రాఫిక్స్కు అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందాయి.
ఈ మూవీ ప్రమోషన్స్కి సంబంధించిన వివరాలను కూడా ప్రశాంత్ వెల్లడించారు. మూవీ ప్రమోషన్స్ను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని గతంలో డిసైడ్ అయ్యారు. మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని దర్శఖుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.
సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ మూవీపై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఇతర భారీ చిత్రాలకు ‘హను - మాన్’ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.