హీరోయిన్ హన్సిక ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె కీలక పాత్రలో నటించిన ‘మైత్రీ’ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఓ కొరియన్ వెబ్ సిరీస్ రీమేక్గా దీన్ని రూపొందించారు. ఎం.రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి ప్రసారం కానుంది.
సైంటిఫిక్ అంశాలతో రూపొందిన ఈ సిరీస్లో హన్సికతో పాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రల్లో నటించారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను విడుదల చేయగా అది ఆసక్తికరంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.
హన్సిక ఇందులో మైత్రి అనే రోబోగా కనిపించడంతో పాటు మరో మహిళగానూ కనిపించనుంది. ఇక ట్రైలర్లో హన్సిక తన లుక్తో, మ్యానరిజంతో ఆకట్టుకుంటోంది.
ఓ యువ సైంటిస్ట్ చేసిన చిన్న తప్పు కారణంగా రోబో మహిళగా మారడం ఆ లేడీ రోబోతో కొందరు యువకులు ప్రేమలో పడే సన్నివేశాలను ఇందులో సరదాగా చూపించారు.
ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు మరో 6 భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. హన్సిక ఇప్పటి వరకూ ఇలాంటి పాత్రలో కనిపించలేదని చెప్పా
ఇటీవల విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ‘ఐయామ్ నాట్ ఏ రోబోట్’ కు ఇది అధికారిక రీమేక్ అని తెలిపారు.