ఈ ఏడాది స్పిరిట్ లేనట్టే! మార్క్ ఆంటోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
13 September 2023
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ పేరుతో ఓ సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసింది.
ఈ సినిమా షూటింగ్కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. ఈ ఏడాదిలో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదన్నారు.
హీరో విశాల్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్లో నటించిన ట్రైమ్ ట్రావెల్ ఫాంటసీ డ్రామా చిత్రం మార్క్ ఆంటోని.
సెప్టెంబర్ 15న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయినా... తొలి విజయం మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే అందుకున్నారు మృణాల్ ఠాకూర్.
ప్రజెంట్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ... ఇప్పుడు భాష మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం తెలుగు కోచింగ్ తీసుకుంటున్న ఈమె త్వరలో తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారు.
బాక్సాఫీస్ దగ్గర జవాన్ విధ్వంసం కొనసాగుతోంది.ఐదు రోజుల్లో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జవాన్, బాహుబలి 2 రికార్డ్ను కూడా బ్రేక్ చేసింది.
అక్షయ్ కుమార్, దిశా పాట్నీ జంటగా తెరకెక్కుతున్న సూపర్ హిట్ త్రీక్వెల్ వెల్ కం 3. ఈ చిత్ర నిర్మాత ఫిరోజ్ నదియావాలా గతంలో ఫిలిం వర్కర్స్కు ఇవ్వాల్సి బకాయిలు ఇంకా క్లియర్ చేయలేదు.
దీంతో సినీ కార్మికులెవరు వెల్ కం 3 షూటింగ్కు హాజరు కావద్దని తీర్మానించింది ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అసోషియేషన్.
ఒకప్పుడు ఇండియా సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ సినిమానే ఇండియన్ ఇండస్ట్రీకి కేరాఫ్గా మారింది అన్నారు భూషణ్ కుమార్.