మాధనుడి మరదలు వలె మెస్మరైజ్ చేస్తున్న ఫరియా..

Battula Prudvi

20 October 2024

28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా.

ఈ బ్యూటీ హిందీ-ఉర్దూ మాట్లాడే కుటుంబంలో పెరిగినప్పటికీ సినిమాలపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్ లో థియేటర్ నటిగా పనిచేసింది. తర్వాత హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.

2021లో తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ.

2022లో సంతోష్ శోభన్ సరసన లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ అనే సినిమాలో కథానాయకిగా మెప్పించింది ఈ వయ్యారి భామ.

2023లో రవితేజ హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రావణాసురలో పాత్రలో నటించింది ఈ బ్యూటీ.

అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్‌ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

ఈ ఏడాది అల్లరి నరేష్ సరసన  రొమాంటిక్ కామెడీ ఆ ఒక్కటి అడక్కు, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా 2లో నటించింది.