త్వరలో ఓటీటీలోకి ఫహాద్‌ ఫాజిల్‌ లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ధూమమ్‌’..

పుష్ప ఫేమ్ ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన తాజా చిత్రం ధూమమ్‌.

యూ టర్న్ చిత్రంతో హిట్ అందుకున్న పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కేజీఎఫ్‌, కాంతారా వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హోంబలే ఫిల్మ్స్  సంస్థ నిర్మించిన చిత్రమిది.

కాగా ఈ చిత్రం జూన్ 23న తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అయితే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

జులై 21 నుంచి ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌కి జోడిగా అపర్ణ బాలమురళి నటించింది.