ఈ భామ అందాన్ని చూసిన ఆ బ్రహ్మ బ్యూటీ టాక్స్ కట్టమని అడుగుతాడేమో..

TV9 Telugu

20 April 2024

19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బ.

హైదరాబాద్ లోని వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఓ ప్రముఖ కళాశాల నుంచి మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొందింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో తెరంగేట్రం చేసింది.  హీరోయిన్ గా కెరీర్ మొదలైంది మాత్రం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో అంతక ముందు సినిమాతో..

తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది.

అమీ తుమీకి మూడు అవార్డులు కూడా లభించాయి. తర్వాత మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది.

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది. తర్వాత కొన్ని చిత్రం కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

2023 లో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది. 3 రోజెస్, పిట్టా కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.