రెండేళ్లుగా నో సినిమా.. అయినా తగ్గని క్రేజ్.. 

20 August   2026

Rajeev 

Pic credit - Instagram

2016లో నాని సరసన నటించిన 'జెంటిల్ మన్' చిత్రంతో నివేదా థామస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

తొలి సినిమాతోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రను పోషించి, ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్‌ను సాధించింది ఈ ముద్దుగుమ్మ. 

 ఆ తర్వాత 'నిన్ను కోరి', 'జై లవ కుశ', 'బ్రోచేవారెవరురా', 'వి', 'వకీల్ సాబ్' వంటి హిట్ చిత్రాల్లో నటించి వరుస హిట్స్ అందుకుంది. 

ఇటీవల వచ్చిన '35 చిన్న కథ కాదు' చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తమిళంలో కమల్ హాసన్ నటించిన 'పాపనాశం', రజినీకాంత్ నటించిన 'దర్బార్' వంటి పెద్ద చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

సినిమాల విషయంలో నివేదా థామస్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. రెగ్యులర్ స్టోరీలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.