హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా?

04 October 2024

Basha Shek

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది.

సెప్టెంబర్ 27న విడుదలైన ఈ పాన ఇండియా మూవీ రూ. 500 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది.

కాగా దేవర సినిమాకు గానూ జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న పారితోషకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదేంటంటే.. ఈ సినిమాకు తారక్ ఏకంగా రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే తారక్ ఫస్ట్ మూవీకి ఎంత  రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

  2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్ను చూడాలని’  చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు తారక్.

ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కు దివంగత రామోజీ రావు రూ. 4 లక్షల పారితోషికం ఇచ్చారట.

అయితే అప్పట్లో అంత డబ్బును ఏం చేయాలో తెలియక తన తల్లికి ఇచ్చానని చెప్పుకొచ్చాడు తారక్.