01 May 2025

25 ఏళ్లుగా తోపు హీరోయిన్.. ఒక్కో సినిమాకు కోట్లు డిమాండ్..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాదిలో చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ హిజీగా ఉంది ఈ అమ్మడు. 

దాదాపు రెండున్నర దశాబ్దాల కెరీర్‏లో సీనియర్  టూ యంగ్ హీరోస్ అందరి సరసన నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 

ఇప్పటికీ వరుస ఆఫర్స్ అందుకుంటూ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తుంది. ప్రస్తుతం హాట్రిక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీదుంది ఈ హీరోయిన్. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ త్రిష. 1999లో జోడి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత వర్షం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకుంది. దీంతో తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో ఆఫర్స్ వచ్చాయి. 

ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది త్రిష. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లకు పైగా వసూలు చేస్తుందని టాక్. 

అలాగే వాణిజ్య ప్రకటన కోసం ఏడాదికి రూ.9 కోట్లు డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. 

అలాగే ఆమె వద్ద కోట్లాది విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ. 63 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పలు బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి.