21 June 2024

దేవర బ్యూటీకి ముంబైలో రూ.65 కోట్ల భవనం.. జాన్వీకి చెన్నైలోనూ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఇటీవల రాజ్‌కుమార్ రావుతో కలిసి జాన్వీ నటించిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా, మిస్టర్ & మిసెస్ మహి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

 ఇక జాన్వీ విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. జాన్వీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకోండి. 

నివేదికల ప్రకారం జాన్వీ కుటుంబం పాలి హిల్‌లోని తమ డ్యూప్లెక్స్ లగ్జరీ భవనం కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 65 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్

అలాగే చెన్నైలో నాలుగు ఎకరాల విలాసవంతమైన భవనాన్ని కలిగి ఉంది. ఈ ఇళ్లు దివంగత నటి శ్రీదేవి సంపాదించిన మొదటి ఆస్తి అని సమాచారం. 

జాన్వీ దగ్గర విలాసవంతమైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.1.94 కోట్ల విలువైన జర్మన్ సెడాన్ కారు కలిగి ఉంది. అద్భుతమైన ఇన్-బిల్డ్ ఫీచర్స్ ఉన్నాయి. 

జాన్వీ గ్యారేజీలో 95 లక్షల రూపాయల విలువైన BMW X5 కారు ఉంది. ఇది  6.5 సెకన్లలో రూ.0-100 కి.మీటర్ల దూరం వెళ్లగలదని సమాచారం. 

BMW X5, Mercedes Maybach S560తోపాటు రూ. 2.7 కోట్ల లెక్సస్ ఎల్‌ఎక్స్ 570, రూ.1.62 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఉన్నాయి.