13 March 2024

ప్రేమలు హీరోయిన్ మమితా బైజు గురించి ఈ విషయాలు తెలుసా ?..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం తెలుగు యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా ప్రేమలు. ఈ మలయాళీ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి తనయుడు కార్తీకేయ రిలీజ్ చేశారు. 

ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజు. ఇందులో ఆమె నటనకు జక్కన్న సైతం ఫిదా అయ్యాడు. ఈ సినిమాలో రీను పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 

ఇప్పుడు తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన క్రష్‏గా మారిపోయింది. మమితా బైజు.. ఇదివరకు మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 

2001 జూన్ 22న కేరళలోని కొట్టాయం ప్రాంతంలో జన్మించింది మమితా. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మమితా.. 2017లో సర్వోపరి పాలక్కారన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. 

తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత జావా, అల్ఫోన్సా, ఖోఖో, ప్రణయ విలాసం సినిమాల్లో నటించింది. ఖోఖో సినిమాకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది. 

తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టమని.. సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం డాన్స్ అని.. డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమైన పని అని చెప్పుకొచ్చింది. 

మమితా బైజు తండ్రి డాక్టర్. దీంతో ఆమె 12వ తరగతి తర్వాత మెడిసిన్ తీసుకోవాలని మంచి డాక్టర్ కావాలని తన కుటుంబసభ్యులు అనుకున్నారని.. కానీ నటిగా మారనని తెలిపింది. 

ఇప్పుడు ప్రేమలు సినిమాతో తెలుగులోను మమితాకు మరింత క్రేజ్ వచ్చేసింది. ఇందులో రీను పాత్రలో మమితా నటన చూసి తెలుగు అడియన్స్, సెలబ్రెటీలు ఫిదా అయ్యారు.