అనుకున్నామని జరగవు అంటూ.. క్లారిటీ ఇచ్చిన దిశా పటాని.

Anil Kumar

02 July 2024

వరుఙ్ తేజ్ హీరోగా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో లోఫర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని.

టాలీవుడ్ లో మొదలైన దిశా.. కెరీర్‌లో ఇప్పుడిప్పుడే హై మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

సౌత్ నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఊహించిన స్థాయిలో స్టార్ డమ్ రేంజ్ అందుకోలేకపోయింది.

స్లో గా నడిచిన దిశా కెరియర్ ఇక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.

తాజాగా దిశా మాట్లాడుతూ.. మొదట్లో తాను యుద్ధ విమాన పైలట్‌ కావాలని కోరుకున్నట్టు తెలిపారు నటి దిశా పటాని.

అయితే జీవితంలో అనుకున్నవన్నీ జరగవని.. నటిగా సక్సెస్‌ కావడం తనకి ఆనందంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసారు.

చాలామంది పలు మార్లు అడుగుతున్నారు.. ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలు తనకు లేవని.. ఆ హీరోతో అయినా సరే.. 

మంచి కేరక్టర్‌ వస్తే.. ఏ భాషలోనైనా తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి తెలిపారు హీరోయిన్ దిశా పటాని.