సోయగంతో ఆ హిమశిఖరాలను హీట్ ఎక్కిస్తుందేమో ఈ భామ..

TV9 Telugu

08 April 2024

13 జూన్ 1992న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో హిందు రాజపుట్ కుటుంబంలో జన్మించింది అందాల తార దిశా పటాని.

ఆమె తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీసు అధికారిగా పని చేస్తున్నారు. ఆమె తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్ గా ఉన్నారు.

ఈ వయ్యారి అక్క ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్. ఆమెకు సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివింది.2013లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ లో మొదటి రన్నరప్‌గా నిలిచింది.

2015లో వరుణ్ తేజ్‌కి జోడిగా లోఫర్ అనే తెలుగు యాక్షన్ డ్రామా సినిమాతో చలచిత్ర అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

2016లో ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే బాలీవుడ్ బయోపిక్ చిత్రం ప్రియాంక ఝా పాత్రలో ఆకట్టుకుంది.

దీని తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది ఈ భామ. భాగీ 2, భాగీ 3 వంటి బ్లాక్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు కంగువలో ఓ పాత్ర చేస్తుంది.