OTTలోకి యాత్ర2.. ఎప్పుడంటే ??

TV9 Telugu

15 March 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2.

సుమారు ఐదేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించన యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది.

 యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది.

యాత్ర 1 తో పోలిక రావడంతో యాత్ర 2పై అంచనాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఈ పొలిటికల్ డ్రామా కేవలం ఒక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.

ఎలాంటి కాంట్రవర్సీలకు చోటివ్వకుండా కేవలం సీఎం జగన్ జీవితంలోని ఆసక్తికర అంశాలను స్పృశిస్తూ యాత్ర 2 ను  తెరకెక్కించారు.

అయితే  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వీడియో సీఎం జగన్‌ బయోపిక్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

 ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి యాత్ర 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.