టైమ్ స్క్వేర్‌పై చిరు.. దర్శకుడిగా మారనున్న విలన్..

TV9 Telugu

31 January 2024

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో భారతదేశంలోనే కాదు అమెరికాలో ఉన్న అయన అభిమానులు కూడా మురిసిపోతున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌పై చిరంజీవి విజువల్స్‌ను ఫ్యాన్స్ ప్రదర్శించారు.

'దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను సాధించిన సందర్భంగా అభినందనలు మెగాస్టార్ చిరంజీవి గారు' అంటూ విజువల్స్‌పై పేర్కొన్నారు.

దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చుసిన సినీ ప్రేమికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఛత్రపతి, మర్యాద రామన్న సహా ఎన్నో తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా తన నటనతో మెప్పించిన నటుడు సుప్రీత్.

కొన్ని రోజులుగా ఈయన సినిమాలు చేయడం లేదు. అయితే తెరవెనక పెద్ద ప్లానింగ్ సిద్ధం చేసారు నటుడు సుప్రీత్.

ఈ విలన్ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారు. నేచురల్ స్టార్ నానికి ఓ యాక్షన్ కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది.

ఈయన దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాను డివివి, యువీ క్రియేషన్స్‌లో ఒకరు నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.