యుద్ధ భూమిలో ధనుష్.. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’.

అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రియాంకా అరుళ్‌ మోహన్, నివేదితా సతీష్‌ నటిస్తుతున్నారు.

1930-40ల మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.

తాజా ఈ శుక్రవారం ఈ చిత్రం నుంచి ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ను  విడుదల చేసింది చిత్రబృందం.

ఆ ఫస్ట్‌లుక్‌లో ధనుష్‌ మొదటి ప్రపంచ యుద్ధం నాటి లూయిస్‌ మెషిన్‌ గన్‌ను పట్టుకొని యుద్ధభూమిలో కనిపించారు.

ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.