ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ చిత్రంలో హాస్య బ్రహ్మ..

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం గుంటూరు కారం.

ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడి లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుంది.

అలాగే మరో కథానాయకిగా మీనాక్షి చౌదరిని  ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

హాసిని & హారిక క్రియేషన్స్ పథకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ చిత్రంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా భాగం కానున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు- బ్రహ్మానందం- త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు చిత్రం ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు కలిసి గుంటూరు కారం చిత్రం నవ్వులు పూయించనున్నారని సమాచారం.