సైలెంట్‌గా మొదలైన రామాయణం.. ఆహాలో సుడిగాలి..

TV9 Telugu

06 April 2024

చాలా రోజులుగా సోషల్ మీడియా చర్చల్లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ రామాయణ సినిమా ఎట్టకేలకు సైలెంట్‌గా మొదలైంది.

ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ.

ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ముంబైలో జరిగింది.

మొదటి షెడ్యూల్ మొదలైంది.. త్వరలోనే రణ్‌బీర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. 2025 డిసెంబర్‌లో రామాయణ 1 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

బుల్లితెరపై యాంకర్‌గా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్. హీరోగానూ నటిస్తున్నారీయన.

తాజాగా ఆహాలో ప్రసారం అవుతున్న సర్కార్ సీజన్ 4కి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు జబర్దస్త్ కమెడియన్ సుధీర్.

ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు షో నిర్వాహకులు. ముందు మూడు సీజన్లు ప్రదీప్ హోస్ట్‌ చేసారు.

ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం G.O.A.T. ఇందులో క్రేజీ హీరోయిన్ దివ్య భారతి ఆయనకి జోడిగా నటిస్తుంది.