TV9 Telugu
ఎంపీ గా బరిలోకి దిగనున్న కంగనా.! అధికారిక ప్రకటన.
25 March 2024
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాలలోనే ఉంటుంది.
అక్కడి స్టార్ హీరోలపై ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది కంగనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు.
ఇదిలా ఉంటె నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారం (మార్చి 24) విడుదల చేసింది.
ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉంది. హిమాచల్లోని మండి నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది.
హిమాచల్ ప్రదేశ్లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపనున్నట్లు బీజేప ప్రకటించింది.
బీజేపీకి బలమైన మద్దతుదారుల లిస్టులో కంగనా పేరు తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీకి పలు సార్లు మద్దతు పలికిందామె.
ఇక కంగనా రనౌత్ నటనా ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా ప్రకటించింది.
కంగనా రనౌత్ తో పాటు ఉత్తర ప్రదేశ్లోని మీరట్ స్థానం నుంచి బాలీవుడ్ అరుణ్ గోవిల్ కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి