TV9 Telugu

14 February 2024

మరోసారి పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్.. ఎందుకంటే?

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొకటి..

జాక్వెలిన్ , సుఖేష్ చంద్రశేఖర్‌తో స్నేహం కారణంగా ఇబ్బందుల్లో పడింది. వందల కోట్ల రూపాయల మోసం కేసులో సుకేష్ జైలుకెళ్లిన విషయం తెలిసిందే.

అక్కడి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి లేఖలు రాస్తూ వస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతని ప్రవర్తనతో విసిగిపోయింది. 

దీంతో సుకేష్ చంద్రశేఖర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై తనకు భద్రత కావాలని కోరారు జాక్వెలిన్. 

ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తునకు ఆదేశించినట్లు ఇచ్చినట్టు  సమాచారం.

సుకేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చాలా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని కూడా అంటున్నారు. అందుకు ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. 

మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా ఉంది. సుకేష్ చంద్రశేఖర్ కు కూడా కోపం వచ్చింది.

ఇంతకాలం దాచిపెట్టిన నిజాలన్నీ బయటపెడతానని లేఖ ద్వారా హెచ్చరించాడు సుఖేష్.  దాంతో జాక్వెలిన్ పోలీసులను ఆశ్రయించింది.