హద్దుల్లేవు... సరిహద్దుల్లేవు.. అదరగొడుతున్న ‘భోళాశంకర్‌’ టీజర్..

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘భోళాశంకర్‌’.

మెహర్‌ రమేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నారు.

ఈ చిత్రంలో చిరుకి జోడిగా తమన్నా నటిస్తుంది.

చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో కనిపించనుంది.

ఈ చిత్రంలో హీరో సుశాంత్‌ కీలక పాత్రని పోషించారు,

తాజాగా శనివారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

‘మొత్తం 33 మందిని చంపేశాడు... ఒక్కడు’ మొదలయ్యే అంటూ ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది.

ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.