విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘బేబీ’..

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ’.

ఈ చిత్రాన్ని సాయి రాజేష్‌ తెరకెక్కిస్తున్నారు.

మాస్ మూవీ మేకర్స్ పథకంపై ఎస్‌.కె.ఎన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య కథానాయకిగా పరిచయం అవుతుంది.

ఈ చిత్రంలో విరాజ్‌ అశ్విన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కాగా గురువారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.

ఈ చిత్రం జులై 14న ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌ దగ్గర 70అడుగుల రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ చిత్రం ట్రైలర్‌ను వచ్చే వారం విడుదల కానుంది.