మీకు షుగర్ ఉందా ??  అయితే ఈ డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు

TV9 Telugu

19 JULY 2024

ఎండుద్రాక్ష :  ఇందులో షుగర్​ కంటెంట్​ ఎక్కువుగా ఉంటుంది.  రక్తంలో త్వరగా కలిసిపోయి చక్కె స్థాయిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు రోజుకు 10గ్రాముల కన్నా తక్కువ తీసుకోవాలి. 

ఎండిన ఆప్రికాట్లు : ఇవి చాలా తియ్యగా ఉంటాయి.  వీటిలో గ్లూకోజ్​ కంటెంట్​ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. బ్రేక్‌ ఫాస్ట్‌లో 1 లేదా 2 ఆప్రికాట్లును తీసుకోవచ్చు.

ఖర్జూరం పండ్లు :  ఇవి సహజంగా  తీపి స్వభావాన్ని కలిగి ఉంటాయి.  మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సవాలుగా మారుతుంది. వీటిని తినేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం. 

అంజీరా:  అంజీరా పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెరను పెంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఎండిన అత్తి పండ్లను మితంగా తినాలి.  

ప్రూనే ప్రూనే:  వీటిలో కార్బొహైడ్రేట్లు, స్వీట్​ కంటెంట్​ అధికంగా ఉంటాయి.  ఇది ఎండిన ప్లం ఫ్రూట్.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు.  

ఎండిన మామిడిపండ్లు: మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి పండు కాదు. ఇది అధిక మొత్తంలో సహజ చక్కెరను కలిగి ఉంటుంది. 

క్రాన్‌బెర్రీస్ : వీటిలో షుగర్​ కంటెంట్​అధికంగా ఉంటుంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు. రక్తంలో త్వరగా కలిసి... షుగర్​ లెవల్స్​ ను పెంచుతుంది.

ఎండిన పైనాపిల్స్: వీటిలో  చక్కెర కంటెంట్​ అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఎండిన పైనాపిల్స్  తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.