ఆ చందమామ తన పిల్లలకు ఈమెను చూపి బుజ్జగిస్తుంది..

TV9 Telugu

29 May 2024

18 ఫిబ్రవరి 1996న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడాలో జన్మించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్.

పరమేశ్వరన్ ఎరెక్కత్ మరియు సునీత పరమేశ్వరన్ దంపతులు ఈ వయ్యారి తల్లిదండ్రులు. ఆమెకు అక్షయ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.

కేరళలోని ఇరింజలకుడాలో డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

కొట్టాయంలోని CMS కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌ల గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ రావడంతో దీన్ని మధ్యలో వదిలేసింది.

2015లో నివిన్ పౌలీతో కలిసి ప్రేమమ్‌ అనే మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అది కమర్షియల్‌గా విజయం సాధించింది.

2016లో నితీన్ సమంత జంట నటించిన అఆ అనే చిత్రంలో నాగవల్లి అనే పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

అదే ఏడాది తెలుగు ప్రేమమ్ సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటించింది. 2017లో శతమానం భవతి చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది.

తర్వాత కొన్ని తెలుగు హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో నటిస్తుంది.