02 March 2024

కోలీవుడ్‏లో కేరళ కుట్టి జోరు.. ఆ స్టార్ హీరో తనయుడి సరనస అనుపమ..

Rajitha Chanti

Pic credit - Instagram

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇన్నాళ్లు ఓన్లీ ట్రెడిషనల్ లుక్ అన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అయ్యింది. 

తెలుగులో ఈగల్ సినిమాలో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ జోడిగా టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో గ్లామరస్‏గా కనిపిస్తుంది. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూసి అనుపమ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. తమ ఆరాధ్య దేవత ఇలా చేస్తుందేంటీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక ఈ మలయాళీ కుట్టికి ఇప్పుడు ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ  ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా మరో ఛాన్స్ అందుకుంది. 

కోలీవుడ్ స్టార్  హీరో విక్రమ్ చియాన్ తనయుడు ధృవ్ విక్రమ్ ఇప్పటికే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టులో అనుపమను ఎంపిక చేశారట. 

కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారని టాక్. 

అలాగే ఇందులో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ను సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఈ కేరళ కుట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 

త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. తమిళనాడులోని తూత్తుకూడిలో ఈ మూవీ ప్రారంభం కానుంది.