ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు..ఐదు దారి మళ్లింపు

31 October 2023

28 మార్చి 1997న యునైటెడ్ స్టేట్స్‌లోని చికాగోలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అను ఇమ్మాన్యుయేల్.

ఆమె ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత థంకచన్ ఇమ్మాన్యుయేల్ కుమార్తె. 2015లో లేక్‌వ్యూ సెంటెనియల్ హై స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసింది.

చదువు పూర్తైన కొన్నాళ్ళు US ఉంది. తరువాత నటనలో వృత్తిని కొనసాగించడానికి భారతదేశానికి వచ్చింది ఈ బ్యూటీ.

అబ్రిడ్ షైన్ దర్శకత్వం వహించిన మలయాళీ చిత్రం యాక్షన్ హీరో బిజులో కథానాయికగా ఆమె తొలిసారిగా నటించింది.

2016లో వచ్చిన మజ్ను సినిమాలో నాచురల్ స్టార్ నానికి జోడిగా తెలుగు సినీ అరంగేట్రం చేసింది ఈ ముందుగుమ్మ.

తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

2018లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం అనే సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది ఈ వయ్యారి.

ఇటీవల రవితేజకి జోడిగా రావణాసుర చిత్రంలో నటించింది ఈ అందాల తార. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.