TV9 Telugu

27 January 2024

మరీ ఇంత మోసమా OTTలో యానిమల్ పై నెటిజన్స్ ఫైర్.

యానిమల్ సినిమా థియేటర్లలో విధ్వంసం అంటే ఏంటో చూపించింది. దానికి మించి కలెక్షన్లను కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంది.

ఆ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్‌ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముందు ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటే..

యానిమల్‌ ఫ్యాన్స్‌లో తెలియని ఈగర్‌ను పెంచింది. ఈ మూవీని ఓటీటీలో మరో సారి చూడాల్సిందే అని తీర్మానించుకునేలా చేసింది.

కానీ కట్ చేస్తే.. తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న యానిమల్ సినిమా సందీప్ మాటలకు దూరంగా ఉండడం ఇప్పుడు వారందర్నీ బాధిస్తోంది.

అబ్బే మరి ఇంత మోసమా అని నెట్టింట కామెంట్ చేసేలా చేస్తోంది. ఓటీటీలో యానిమల్ దెబ్బేసింది అని దిగాలు పడేలా చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే..! ఈ సినిమా ఓటీటీ వెర్షన్ ను కాస్త పొడగించి విడుదల చేస్తామని గతంలో సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దాదాపు 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తామని కాస్త గట్టిగానే అందరికి రీచ్ అయ్యేలానే చెప్పారు. దీంతో అందర్లో క్యూరియాసిటీ పెరిగింది.

కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న సినిమా మొత్తం థియేట్రికల్ వెర్షన్ లో ఉంది. ఎక్ట్స్రా సీన్స్‌ లేవు. దీంతో చాలా మంది నెటిజన్స్.. డిస్సపాయింట్ అవుతున్నారు.