అందమైన ఈ భామ చేసి ఆ జాబిల్లి కూడా ప్రేమలో పడుతుందేమో..

20 December 2023

TV9 Telugu

20 జూలై 1993న కాకతీయ సామ్రాజ్య రాజధాని వరంగల్ లో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది ఆనంది. ఈమె అసలు పేరు రక్షిత.

2012లో ఈరోజుల్లో అనే తెలుగు రొమాంటిక్ సినిమాతో ఓ చిన్న పాత్రలో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

తర్వాత ప్రిన్స్, శ్రీదివ్య జంటగా నటించిన బస్ స్టాప్ అనే తెలుగు రొమాంటిక్ మూవీలో సీమ అనే పాత్రలో మెప్పించింది.

2013లో ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రంలో తొలిసారి లీడ్ రోల్ చేసింది. ఇందులో ఆనందికి బదులు హాసికగా అనే పేరు ఉంది.

2014లో పోరియాలన్ అనే తమిళ చిత్రంలో కథానాయపైగా కోలీవుడ్ కి పరిచయం అయింది. తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో కనిపించింది.

2021లో వచ్చిన జాంబీ రెడ్డిలో యంగ్ హీరో తేజ సజ్జకి జోడిగా తెలుగులో హీరోయిన్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ.

అదే ఏడాది సుధీర్ బాబు సరసన శ్రీదేవి సోడా సెంటర్ అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో కనిపించింది ఈ భామ.

2022లో సోషల్ థ్రిల్లర్ డ్రామా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో అల్లరి నరేష్ కి జోడిగా ఆకట్టుకుంది.