13 February 2024

ఓటీటీలోకి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్

TV9 Telugu

రైటర్ పద్మభూషణ్‌ తో హిట్‌ కొట్టిన సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు.

ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ కలెక్షన్లు రాబడుతుంది.

కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్‌ గా నటించింది.

ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోన్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ చిత్రం ఓటీటీ రిలీజ్‌గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా సుహాస్‌ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

థియేట్రికల్‌ వెర్షన్‌ రిలీజైన నెలరోజుల్లోపే ఈ మూవీని స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

బహుశా మార్చి 1 నుంచే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.