జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆనందంలో ఉండగానే, మరో అద్భుతమైన విషయం చెవిలో పడింది. త్వరలోనే చలో దుబాయ్ అనేస్తున్నారు పుష్పరాజ్. ఎందుకంటారా? చూసేద్దాం రండి....
ఇక ఎవరూ వేర్ ఈజ్ పుష్ప అని వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుష్పరాజ్ ఎక్కడ రూల్ చేస్తున్నాడో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ అయ్యాక కూడా వేర్ ఈజ్ పుష్ప అని ఎందుకు అడుగుతాం అని అంటోంది అల్లు ఆర్మీ. మా హీరో ధాటికి సరికొత్త రికార్డులు సెట్ కావాల్సిందేనంటోంది.
దాక్కో దాక్కో మేక అని ఇతర హీరోల ఫ్యాన్స్ ని చూసి, సరదాగా ఆటపట్టిస్తున్నారు అల్లు ఫ్యాన్స్. బన్నీ మాత్రం ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటున్నారు.
అది కూడా అక్కడెక్కడో కాదు.. ఈ సారి దుబాయ్ కేంద్రంగా అని ఫిక్సయిపోయారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్.
స్టైలిష్ స్టార్గా సౌత్లో అల్లు అర్జున్కి ఓ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్లో ఆయన్ని ఐకాన్ స్టార్గా ఎలివేట్ చేస్తున్నదీ అదే.
ఆ ఫేమ్ ఇప్పుడు దుబాయ్దాకా పాకింది. అక్కడ అల్లు అర్జున్కి స్పెషల్గా వ్యాక్స్ స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ బన్నీ మెజర్మెంట్స్ తీసుకున్నారు నిర్వాహకులు.
నవంబర్లో దుబాయ్లో అల్లు అర్జున్ స్పెషల్ స్టాచ్యూ ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ టాలీవుడ్లో మహేష్ కీ, ప్రభాస్కీ వ్యాక్స్ స్టాచ్యూలున్నాయి.
అయితే, దుబాయ్లో ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్న ఫస్ట్ హీరో మాత్రం అల్లు అర్జునేనంటూ పండగ చేసుకుంటున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్.