కేజ్రీ కాంబో మళ్ళీ రిపీట్..

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ అంటే ఇండస్ట్రీలో హిట్ కాంబో.

వీరిద్దరూ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చాయి.

ఈ చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన  మొదటి చిత్రం జులాయి.

ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తితో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

దీని తర్వాత అల వైకుంఠపురంలో భారీ విజయం గురించి అందరికి తెలిసిందే.

తాజాగా సోమవారం వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానున్నట్లు అధికారంగా తెలిపారు.

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా ఈసారి అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ ఎలా చూపించనున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది.