ఆదిపురుష్ వివాదం.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు సీరియస్..

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదిపురుష్.

విడుదల రోజు నుంచే ఈ చిత్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చిత్రంలో కొన్ని సీన్స్, డైలాగ్స్, వేషాధారణ రామాయాణానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

దీంతో ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని పలు కోర్టులలో పిటిషన్స్ దాఖలయ్యాయి.

అలహాబాద్ హైకోర్టులో ఈ చిత్రంలో కొన్ని డైలాగ్స్ తొలగించాలంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

ఈ మేరకు మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు సెన్సార్ బోర్డ్ తీరుని తప్పుబట్టింది.

సెన్సార్ సమయంలో ఇలాంటి డైలాగ్స్ ను ఎందుకు సమర్థించారని సెన్సార్ బోర్డును ప్రశ్నించింది అలహాబాద్ హైకోర్టు.

ఇటువంటి డైలాగ్స్, సీన్స్ తో భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాలను ఇవ్వాలనుకుంటారని ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే ఈ విచారణకు డైరెక్టర్, నిర్మాత హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.