ఆరోజు నుంచి ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్‌ ‘ ఫర్హానా’..

ఐశ్వర్య రాజేశ్‌ ఇటీవల నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ ‘ ఫర్హానా’.

ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శత్వం వహించారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్. ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంలో సెల్వ రాఘవన్‌, జితన్‌ రమేశ్‌, ఐశ్వర్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రం మే 12న థియేటర్లలో సందడి చేసింది.

ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

జులై 7 నుంచి ‘సోనీ లివ్‌’ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి స్వరాలందించారు.