21 September 2024

ఇండస్ట్రీలో వేధింపులు.. వారికి హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ సలహా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై వేధింపులపై నటి ఐశ్వర్య రాజేశ్ స్పందించారు. 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేశ్ సినీరంగంలో మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలని.. దోషులకు సరైన శిక్ష పడాలని అన్నారు. 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేశ్ సినీరంగంలో మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలని.. దోషులకు సరైన శిక్ష పడాలని అన్నారు. 

సినీరంగంలో నేను ఇప్పటివరకు ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు.. వేధింపులకు పాల్పడిన దోషులకు సరైన శిక్ష పడాల్సిందే అని అన్నారు. 

ఇండస్ట్రీలోని మహిళలకు తాను ఇచ్చే సలహా ఒక్కటే అని.. అందరు ధైర్యంగా ఉండాలని.. చొరవ తీసుకోవాలని ప్రయత్నిస్తే అలర్ట్ కావాలని.. 

గట్టిగా మీ వాయిస్ పెంచాలని అన్నారు. అవుట్ డోర్ షూట్స్ కు వెళ్లినప్పుడు సరైన వసతులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వాష్ రూమ్స్ సరిగ్గా ఉండడం లేదని అన్నారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. 

మలయాళీ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండీషన్స్ రెమ్యునరేషన్ పై హేమ కమిటీ ఓ నివేదిక రెడీ చేసింది.