మీ అందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను.. ‘ఆదిపురుష్‌’ రైటర్ మనోజ్..

ప్రభాస్ రాముడిగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’.

ఈ చిత్రంలో కృతీసనన్‌ జానకిగా కనిపించింది.

రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రమిది.

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచింది.

ఇదిలాఉంటే ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

కాగా తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ ప్రేక్షకులను  క్షమాపణలు తెలిపారు.

ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను అన్నారు.

అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు.

ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మనోజ్ ముంతశిర్.