28 February 2025

వివాదాలు, ట్రోలింగ్‏తో ఫేమస్.. 251 జంటలకు పెళ్లిళ్లు చేసిన హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆ తర్వాత స్పెషల్ పాటలతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంది ఈ హీరోయిన్.

నిత్యం వివాదాలు, ట్రోలింగ్స్ కారణంగా వార్తలలో నిలుస్తుంటుంది. ఇటీవల ఓ స్టార్ హీరో ఆరోగ్యం గురించి మాట్లాడి మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. 

ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ ఊర్వశి రౌతేలా. హిందీ, తెలుగు భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

ఇటీవలే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో అభిమానులను అలరించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 

అలాగే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ లో మెరిసిం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ న్యూస్ వైరలవుతుంది. 

ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరపున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోది హాజరయ్యారు.

అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు వివాహం జరిపించారు. 

అంతేకాదు.. తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.