ఈ హీరోయిన్ తోపు.. 41 ఏళ్ల వయసులోనూ భారీగా రెమ్యునరేషన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
రెండు దశాబ్దాలుగా సినీరంగాన్నే ఏలేస్తున్న ఈ అమ్మడు వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఇప్పటికీ టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది.
చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటినిస్తుంది. ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది హాట్ టాపిక్గా మారింది.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ త్రిష. 1999లో జోడి చిత్రంలో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది. 2003లో హీరోయిన్గా కనిపించింది.
2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన వర్షం సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది.
తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్న త్రిష.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది.
పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటుంది.
ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.1 కోటి నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సీరియర్ హీరోలకు క్రేజీ జోడిగా మారింది.