తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ ఇప్పుడు సినిమాలు తగ్గించింది.
యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత‘హ్యాపీడేస్ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఆతర్వాత వచ్చిన కొంచం ఇష్టం.. కొంచం కష్టం సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆతర్వాత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో తన అందంతో అక్కడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది.
గతంలో హెబ్బా పటేల్ నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్' సినిమా సీక్వెల్ లో ఇప్పుడు తమన్నా నటిస్తుంది. ఈ బ్యూటీ బోనం ఎత్తుకున్న పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.